ముంబై నగరంపై నాటి ముష్కరుల దాడికి మన అసమర్ధతే కారణం : ప్రధాని మోదీ

SMTV Desk 2017-09-11 12:23:37  Swamy vivekananda, Prime minister Narendra modi, mumbai terrarist attack in 1983, young india-new india.

చికాగో, సెప్టెంబర్ 11 . ముంబైపై ఉగ్రవాదులు దాడి చేయడానికి మన అసమర్ధతే కారణమని వ్యాఖ్యానించారు. చికాగోలో స్వామి వివేకానంద స్ఫూర్తిదాయక ప్రసంగం చేసి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేడు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్వామి వివేకానందుడు చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసిన మోదీ, "యంగ్ ఇండియా - న్యూ ఇండియా" అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత వివేకానందుడి ఆలోచనల నుంచి స్ఫూర్తి పొంది, కళలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని ఆయన కోరారు. ఆనాడు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ముంబై నగరంపై ముష్కరులు దాడికి పాల్పడ్డారని విమర్శించారు. అప్పుడే కనుక నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తే వందలాది మంది ప్రాణాలు మిగిలేవని మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.