హైదరాబాద్ సెప్టెంబర్ 10: తన మొదటి సినిమా అర్జున్ రెడ్డి చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది శాలిని పాండీ . ఇప్పుడు మరొక అవకాశాన్ని కొట్టేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సావిత్రి పాత్రకు కీర్తి సురేశ్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ చేస్తున్నారు. ఇంకా సమంత మరియు ప్రకాష్ రాజ్ లను కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఇపుడు లేటెస్ట్ గా శాలిని పాండే ని ఈ సినిమా కోసం తీసుకోనున్నారని సమాచారం. నాగ్ అశ్విన్ అర్జున్ రెడ్డి సినిమా చూసిన తరువాత శాలిని నటన ఆకట్టుకోవడంతో ఆమెను తీసుకున్నారని తెలిసింది.