చెన్నై, సెప్టెంబర్ 10: దేశంలో ఎన్నో వాహనాలు ఉన్నప్పటికీ మధ్య తరగతి కుటుంబాలకు సౌకర్యంగా అందుబాటులో ఉండే వాహనం ఆటో. అయితే ఇప్పుడు కొత్తగా పలు నగరాల్లో ఏసీ ఆటోలు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏసీ ఆటోలు త్వరలో చెన్నై నగరంలో కూడా తిరగబోతున్నాయట. ఈ సందర్బంగా హిరోయిన్ రాయ్లక్ష్మి తన సోషల్ మీడియాలో..." చెన్నైకి ఈ వాహనాలు రావడం చాలా సంతోషంగా ఉందని" ఆనందం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఏసీ ఆటో ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాయ్లక్ష్మి తన కొత్త చిత్రం ‘జూలీ 2’ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.