ముంబాయి సెప్టెంబర్ 8 : బాలీవుడ్ నటుడు ‘ఓంపురి’ ఈ ఏడాది జనవరిలో ఆరోగ్యం బాగోలేక కన్ను మూసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆయనకు ఇద్దరు భార్యలు వాళ్లు సీమ కపూర్ మరియు నందిత పూరి. ఇపుడు వాళ్లిద్దరూ అయన గురించి, అయన వ్యక్తిగత విషయాలను గురించి సినిమాగా తీస్తామంటున్నారు. కానీ కలిసి సినిమా తీయటం లేదు, ఇద్దరు వేర్వేరుగా ఆయన గురించి సినిమా తీస్తున్నారు. సీమ కపూర్ అయన జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తీయాలని యోచిస్తున్నారు. నందిత మాత్రం తానూ రాసిన ‘అన్లైక్లీ హీరో’ అనే పుస్తకాన్ని సినిమాగా తీస్తానంటున్నారు. గతంలో ఓంపురి ఈ బుక్ ని విడుదల చేయనివ్వలేదని నందిత పేర్కొన్నారు. ఇపుడు అదే బుక్ ని ఆధారంగా చేసుకొని సినిమా తీయబోతున్నారు. ఈయన ‘ఘాజి ఎటాక్’ లో నావల్ ఆఫీసర్ గా నటించారు.