వాయిస్‌ఓవర్ ఇవ్వనున్న రాజమౌళి...!

SMTV Desk 2017-09-05 11:37:34  rajamouli, srivalli, vijayendra prasad, voice over,

హైదరాబాద్ సెప్టెంబర్ 5 : బాహుబలి, బజరంగి భాయిజాన్ చిత్రాలకు రచయిత గా పనిచేసి దేశవ్యాప్తంగా ఎంతో పెరుతెచుకున్నారు విజయేంద్ర ప్రసాద్ గారు. ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం “శ్రీ వల్లి”. మన తెలుగు ఇండస్ట్రీ లో పెద్ద స్టార్ల తో వాయిస్ ఓవర్ ఇప్పించడం ఓ ఆనవాయితి గా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో, దీని వల్ల సినిమా కు కూడా ఎంతో కలసివస్తుందని చెప్పనవసరం లేదు. ఇపుడు ‘శ్రీవల్లి’ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ తనయుడు రాజమౌళి గారు వాయిస్‌ఓవర్ చెప్పనున్నారు. అప్పట్లో "చత్రపతి" చిత్రానికి రాజమౌలి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రోటాన్స్, న్యూట్రాన్స్‌తో పాటు విశ్వాంతరాలలో లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఖగోళాలను మనసుతో చూడగలుగుతున్నాం. అలాంటి మనసును కొలవగలిగితే, చూడగలిగితే ఎలా ఉంటుందనే ఆలోచన నుంచే ఈ కథ పుట్టింది. పుట్టుకతో ఏ మనిషి దొంగ, వ్యసనపరుడు కాడు. పరిస్థితులే వారిని అలా మారుస్తాయి. ఆ మార్పును సరిదిద్ది వారిని స్వచ్ఛమైన మనస్కులుగా మళ్లీ మార్చగలిగితే ఎలా ఉంటుందనే అంశాన్ని సినిమాలో చూపించాం. ఓ అమ్మాయి మనసుపై శాస్త్రవేత్త చేసిన ప్రయోగం కారణంగా ఆమెకు గతజన్మలోని ప్రియుడితో పాటు స్మృతులు గుర్తుకువస్తాయి. ఆ తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయన్నది ఈ సినిమా ఇతివృత్తం. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం ఎమ్.ఎమ్ శ్రీలేఖ స్వరపరుస్తున్నారు, కెమెరామెన్ గా రాజశేఖర్ పనిచేస్తున్నారు.