హ్యూస్టన్, సెప్టెంబర్ 4 : ఇటీవల అమెరికాలోని టెక్సాన్ లో హరికేన్ హార్వీ అనే భారీ వరదలు సంభవించడంతో ఈ వరదల్లో చాలామంది కొట్టుకు పోయారు. అయితే ఈ వరదల్లో భీభత్సం నుంచి భారత విద్యార్ధిని షాలిని సింగ్ అక్కడి అధికారులు రక్షించి ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. పది రోజులుగా చికిత్స పొందుతున్న షాలిని ఆదివారం రోజున మృతి చెందింది. డెంటల్ సర్జరీలో డిగ్రీ పూర్తిచేసిన షాలిని మాస్టర్స్ కోసం టెక్సాస్లోని యూనివర్శిటీకి గత నెలలోనే అమెరికాకు వచ్చినట్లు సమాచారం. ఆగస్టు 26న షాలిని తన స్నేహితుడు నిఖిల్ భాటియాతో కలిసి స్విమ్మింగ్ చేస్తుండగా.. అకస్మాత్తుగా వరదలు సంభవించడంతో ఈ వరదల్లో కొట్టుకుపోతున్న షాలిని, నిఖిల్ను స్థానిక అధికారులు రక్షించి ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆగస్టు 30న నిఖిల్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆదివారం షాలిని కూడా తుది శ్వాస విడిచింది. షాలిని విషయం తెలుసుకున్న ఆమె కుటుంబసభ్యులు వెంటనే ప్రయాణం అయ్యారు. షాలిని అంత్యక్రియలు బ్రెయిన్లో చేయనున్నట్లు కాన్సులేట్ వర్గాలు తెలిపారు.