యునెస్కో, ఆగస్ట్ 30: ఉత్తరకొరియా చేపట్టిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాల నేపధ్యంలో ఐక్యరాజ్య సమితి ఆ దేశ తీరుపై నిప్పులు చెరిగింది. ఇలాంటి వికృత చేష్టలు చేయడం వలన ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయని స్పష్టం చేసింది. మీకు సమస్యలు ఉంటే శాంతియుత, దౌత్యపర, రాజకీయ పరిష్కార మార్గాల దిశగా పయనించాలని సూచనలు జారీ చేసింది. ఉత్తరకొరియా చేపట్టిన సంఘ విద్రోహ చర్యలకు ముగింపు పలకాలని, తన వద్దనున్న అణుబాంబులను నిర్వీర్యం చేయాలని సెక్యూరిటీ కౌన్సెల్ డిమాండ్ చేసింది. ఇలాంటి చర్యలకు మళ్లీ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెలిపింది.