ముంబై, ఆగస్ట్ 29 : ప్రముఖ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అందాల నటి ఐశ్వర్య రాయ్ ల ప్రేమ వ్యవహారం గురించి అప్పట్లో ఒక సెన్సేషన్ గా మారిన విషయం అందరికి తెలిసిందే. కాని ఈ జంట కొన్ని మనస్పర్థల కారణంగా దూరమై ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన ఈ జంట ఆ తర్వాత మళ్ళీ కలిసి నటించలేదు. కాని ప్రేక్షకులకు మాత్రం ఈ జంటను మళ్ళీ చూడాలనే కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. అయితే తాజాగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తీయబోతున్న "పద్మావతి" చిత్రం కోసం వీరిద్దరిని సంప్రదించారట. కాని ఐశ్వర్య రాయ్ ఈ సినిమాలో నటించాలంటే ఒక షరతు పెట్టిందట. ఈ సినిమాలో విలన్ గా అల్లా వుద్దీన్ ఖిల్జీ పాత్రను సల్మాన్ చేస్తే, "పద్మావతి"గా చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. ఇదే విషయంపై సల్మాన్ దగ్గర ప్రస్తావి౦చగా.. ఐశ్వర్య మూవీలో విలన్ గా నటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశాడు. అలా వీరిద్దరి కాంబినేషన్ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ దీపికా పదుకొనె - రణవీర్ సింగ్ లకు వెళ్ళినట్లు బాలీవుడ్ లో వార్త హల్ చల్ చేస్తోంది.