హైదరాబాద్, ఆగస్ట్ 28 : విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "అర్జున్ రెడ్డి" సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ దూసుకుపోతూ, కలెక్షన్ల పరంగా ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. అంతేకాకుండా ఈ సినిమా యువతకు బాగా కనెక్ట్ అవడంతో విజయ్ రెండో సినిమాతోనే స్టార్ హీరోల రికార్డులను బద్దలు కొడుతున్నాడు. ఈ చిత్రం ఓవర్సీస్ లో ప్రీమియర్ షోతో పాటు, మొదటి రోజు కలెక్షన్లను కూడా కలుపుకొని 4లక్షల 60వేల డాలర్లను సాధించింది. అయితే అగ్ర హీరో అల్లు అర్జున్ "సరైనోడు" సినిమా ఇవే షోలకు గాను 3లక్షల 96వేల డాలర్లను వసూలు చేయగా, హీరో నాని నటించిన మూవీ "నిన్ను కోరి" కి 3 లక్షల 82వేల డాలర్లు వచ్చాయి. కాని రామ్ చరణ్ నటించిన "ధృవ" సినిమాకు మాత్రం "అర్జున్ రెడ్డి" కంటే 9వేల డాలర్లు ఎక్కువ కలెక్ట్ చేసింది. "ధృవ" సినిమా 4లక్షల 69వేల డాలర్లను కలెక్ట్ చేసింది. ఎన్ని వివాదాల మధ్య విడుదలైన కూడా "అర్జున్ రెడ్డి" చిత్రం మాత్రం ఓ రేంజ్ లో దూసుకుపోతుందనడానికి ఇదొక నిదర్శనం.