శ్రీలంక బాంబు పేలుళ్లు: కొలంబోకు చేరిన ఎన్‌ఐఏ బృందం

SMTV Desk 2019-05-29 14:45:49  srilanka, bomb attacks, Easter fest, churches, Blasts hit two Sri Lanka churches, 80 injured, Blasts hit two Sri Lanka churches, two hotels on Easter Sunday, Explosions hit churches, hotels in Sri La

శ్రీలంకలోని కొలంబోలో ఈస్టర్ పర్వదినాన జరిగిన వరుస పేలుళ్ళఫై చర్చలకు ఇద్దరు సభ్యులతో కూడిన జాతీయ దర్యాప్తు (ఎన్‌ఐఏ) బృందం మంగళవారం కొలంబోకు వెళ్లింది. బాంబులకు పాల్పడిన వారు భారత్‌లోని కశ్మీర్‌, కేరళలో శిక్షణ పొందినట్లు తెలుస్తోందని శ్రీలంక పోలీస్‌ చీఫ్ ప్రకటన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ పేలుళ్లలో భారత్‌ ములాలు ఉన్నాయని వార్తలు వస్తున్న కారణంగా ఇద్దరు సభ్యులతో కూడిన జాతీయ దర్యాప్తు (ఎన్‌ఐఏ) బృందం మంగళవారం కొలంబోకు వెళ్లింది. దీనిపై మరింత లోతైన విచారణ జరపడానికి ఎన్ఐఏ బృందం అక్కడి అధికారులతో చర్చలు జరపనుంది. ఈ సమావేశంలో అనుమానిత ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని ఇరు దేశాలు పంచుకోనున్నాయని అధికారులు తెలిపారు. దీనిలో భాగంగా లంక పోలీసులు అనుమానితుల నుంచి రాబట్టిన ఫోన్‌నెంబర్లు, సామాజిక మాధ్యమాల ఖాతాలు, వ్యక్తుల పేర్లు వంటి కీలక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నారు. నేషనల్‌ తౌవీద్‌ జమాత్‌ ఉగ్రసంస్థతో తమిళనాడు, కేరళకు చెందిన కొందరు వ్యక్తులకు సంబంధాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో దీనిపై కూడా విస్తృత చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం.