వాషింగ్టన్: అమెరికాలోని ఒక్లహోమాలో సుడిగాలులు తీవ్ర భీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ గాలులతో అమెరికా వణికిపోతోంది. ఈ టోర్నడోలతో ఇద్దరు మరణించగా, మరో 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హాస్పిటల్స్ తరలించి చికిత్స అందిస్తున్న అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పదుల సంఖ్యలో ఇండ్లు, మొబైల్ హోంపార్కు, హోటల్స్ దెబ్బతిన్నాయని తెలిపారు అధికారులు.