ముంబై, ఆగస్ట్ 26 : మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ అప్సెట్ అయ్యారట. ప్రస్తుతం ఐష్ "ఫ్యానీ ఖాన్" అనే చిత్రంలో నటిస్తు౦డగా ఈ చిత్రానికి రాకేశ్ ఓం ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఐశ్వర్యకి జోడీగా నటుడు మాధవన్ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా పలు పత్రికలూ ఇలాంటి వార్తలను ప్రచురించడంతో ఐశ్వర్యరాయ్ కలత చెందినట్లు దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాష్ మీడియాకు తెలిపారు. పత్రికల్లో వచ్చిన ఇలాంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ తప్పుడు ప్రచారాలని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఐశ్వర్య ‘జజ్బా’ చిత్రంతో తిరిగి వెండితెరపై సందడి చేసి, "సరబ్జిత్", "యే దిల్ హై ముష్కిల్" వంటి చిత్రాలతో మంచి హిట్స్ ను సొంతం చేసుకున్నారు.