పోర్ట్మోర్స్బై: మంగళవారం పపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వేసంస్థ వెల్లడించింది. దీని ప్రభావం వళ్ళ బులోలో పట్టణానికి 33 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. ప్రాథమికంగా ఇంకా నష్టాన్ని అంచనా వేయలేదు. ఆ ప్రాంతంలో సునామి వార్నింగ్ కూడా జారీ కాలేదు. గతేడాది కూడా 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు సుమారు 150 మంది మరణించారు.