బ్రిటన్: బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ షైర్లో ఉన్న బ్లెన్హేమ్ ప్యాలెస్లో 18 క్యారెట్ల మేలిమి బంగారంతో మరుగుదొడ్డి నిర్మించనున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్ట్టన్ చర్చిల్ జన్మించిన గది సమీపంలోనే దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మరుగుదొడ్డిని ఇటలీ కళాకారుడు మారిజియో కటెల్లాన్ తయారుచేశాడు. దీనిని ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు బహుమతిగా ఇవ్వాలని గజ్జేన్హేమ్ మ్యూజియం భావించిందట. ఆయన దానిని చల్లగా నిరాకరించారు. దీంతో ప్యాలెస్లో అమర్చాలని నిర్ణయించారు. అయితే దీనిని సామాన్య ప్రజలకు అందుబాటులో వుంచుతారట. కాకపోతే తగిన రుసుము చెల్లించి ఈ బంగారు మరుగుదొడ్డిని వాడుకోవచ్చు అనే నిబంధన పెట్టారు. బంగారు ప్ళళ్ళెంలో తింటే సంతృప్తి వుంటుంది కానీ, బంగారు మరుగుదొడ్డిలో టాయిలెట్ చేయడం అంత బాగా అనిపించదని అంటున్నారు బంగారం ప్రియులు.