హైదరాబాద్, ఆగస్ట్ 18 : "బాహుబలి" తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న "సాహో" చిత్రం కొన్ని రోజుల క్రితం షూటింగ్ ను మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఇప్పటికే చాలా మందిని అనుకోగా చివరికి ఆ అదృష్టం బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ను వరించింది. అయితే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఈ సినిమా మొదటి భాగంలో ప్రభాస్ ప్రమేయం లేని సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు రెండవ షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్ సారధి స్టూడియోలో 5 కోట్ల భారీ బడ్జెట్ తో వేసిన సెట్లో ఈ షూటింగ్ ను ప్రారంభించారు. ప్రభాస్ ఈరోజు నుంచి షూటింగ్ లో పాల్గొంటారని, ఆయన కాంబినేషన్లోని కొన్ని యాక్షన్ సీన్స్ ను ఇక్కడ చిత్రీకరించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ కొన్ని సాహస విన్యాసాలు చేయనున్నట్లు సమాచారం.