ముంబై, ఆగస్ట్ 14 : స్వాతంత్ర్య సమర యోధుడిగా సుభాష్ చ౦ద్రబోస్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే ఆ మహానీయుడి జీవితం ఆధారంగా త్వరలో ఓ వెబ్ సిరీస్ తెర మీదకు తీసుకురానున్నారు. ఈ సిరీస్ ఫస్ట్ లుక్ ను వెబ్సిరీస్ నిర్మాత ఏక్తాకపూర్ తాజాగా విడుదల చేశారు. "బోస్: డెడ్ ఆర్ అలైవ్" అనే పేరుతో వస్తున్న ఈ వెబ్ సిరీస్ లో విలక్షణ నటుడు రాజ్కుమార్ రావ్ బోస్ గా నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్కి హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సిరీస్ పూర్తి ట్రైలర్ను ఆగస్ట్ 18న విడుదల చేయనున్నట్లు ఏక్తా కపూర్ తెలిపారు. ఈ సిరీస్ ను నిర్మాత ఏక్తా కపూర్ కు చెందిన "ఏఎల్టీ బాలాజీ" ఛానల్లో ప్రసారం చేయనున్నట్లుగా తెలిపారు.