వేసవిలో వర్షం భీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో కూడా ఉరుములతో కూడిన వర్షం పడిన సంగతి తెలిసిందే. అయితే హిమాలయ దేశం నేపాల్లో ఆదివారం సాయంత్రం భీకర తుపాను విలయం సృష్టించింది. దక్షిణ నేపాల్ను తాకిన ఈ భారీ తుపాను కారణంగా 25 మంది మరణించగా, 400 మంది గాయాలపాలయ్యారు. పెనుగాలులకు వర్షం కూడా తోడవడంతో అనేక గ్రామాలు చలితో వణికిపోయాయి.
ముఖ్యంగా, బరా, పర్సా జిల్లాలు తుపాను తాకిడికి గురైనట్టు అధికారులు గుర్తించారు. ఈ రెండు జిల్లాల్లో ఎక్కడ చూసినా విలయం తాలూకు ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. తుపాను నష్టంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలి విచారం వ్యక్తం చేశారు.