పల్లవి తీసుకుంది ఇంత తక్కువ పారితోషకమా?

SMTV Desk 2017-08-12 12:39:09  sai pallavi, nani, fidaa, MCA, nani, 25 lakhs, 70 lakhs

హైదరాబాద్, ఆగస్ట్ 12: ఫిదా సినిమాతో పరిచయం అయిన సాయిపల్లవి ప్రేక్షకులని ఎంతగానో ఆకటుకున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కలక్షన్స్ లో సరికొత్త సంచలనాలను సృష్టిస్తుంది. అలాంటి సాయి పల్లవికి భారీ పారితోషికమే ముట్టజెప్పి వుంటారని అనుకోవడం సహజం కానీ ఈ చిత్రానికి సాయి పల్లవి మాత్రం కేవలం 25 లక్షలు మాత్రమే తీసుకుందట. అయితే, ఈ చిత్రం తరువాత సాయి పల్లవి తన పారితోషికాన్ని 70 లక్షలకి పెంచిందట. మరి ఈ విషయం లో నిజం ఎంత వుందో వేచి చూడాలి. అయినా కథల ఎంపికలో ఏ మాత్రం తొందర పడకుండా ఆచి తూచి అడుగువేస్తున్నారట పల్లవి.