పాక్ క్రమంగా అన్ని దేశాలు సంబంధాలు తెంచుకుంటుంది!

SMTV Desk 2019-03-14 18:03:25  pakistan president, imran khan, pakistan former president bilaval bhutto, india, pakistan, war, benajeera bhutto

ఇస్లామాబాద్‌, మార్చ్ 14: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పాక్ ప్రధాని బెనజీర భూట్టో కుమారుడు బిలావల్‌ భుట్టో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న పరిస్థితులపై ఆయన మాట్లాడుతూ...పాకిస్థాన్‌ను ప్రపంచానికి శత్రుదేశంగా ఇమ్రాన్ మార్చేశాడని ఆరోపించారు. అంతేకాక పాక్ క్రమంగా అన్ని దేశాలు సంబంధాలు తెంచుకుంటున్నాయి అని అన్నారు. ఇదంతా ఇమ్రాన్‌ తీసుకుంటున్న చర్యల వల్లే జరుగుతుంది అని చెప్పారు. అయితే ఉగ్రవాద నియంత్రణకు చర్యలు తీసుకుంటుంటే ప్రపంచ దేశాలు పాక్‌పై ఎందుకు మండిపడుతున్నాయి? ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులకు నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయి. ఇండియాపాక్‌ మధ్య ఎప్పటి నుంచో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఎందుకు ఎక్కువయ్యాయి? మీరు(ఇమ్రాన్‌) నిజంగా శాంతిని కోరుకుంటుంటే ముందు ప్రపంచ దేశాల ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఉగ్రవాద నియంత్రణ పట్ల నిజాయతీగా ఉన్నట్లయితే మేం చెప్పే మూడు విషయాలను తీవ్రంగా తీసుకోండి. ఖపార్లమెంట్ నేషనల్‌ సెక్యూరిటీ కమిటీని నియమించండిగ, ఖనిషేధిత ఉగ్రవాద సంస్థలకు మద్దతివ్వడం ఆపేయండి. లేదా వారికి దూరంగా ఉండండిగ, ఖ మీ మంత్రి వర్గంలో ఉండి నిషేధిత సంస్థలతో బంధాలు కొనసాగిస్తున్న వారిపై విచారణ జరిపి వారిని తొలగించండి.. ఈ మూడు చర్యలు ప్రభుత్వం తీసుకుంటే ఉగ్రవాద నియంత్రణకు పాక్‌ ప్రభుత్వం కృషి చేస్తుందని మాతో పాటు అందరూ నమ్ముతారుగ అని భుట్టో వెల్లడించారు.