బలూచిస్థాన్, మార్చ్ 12: బలూచిస్థాన్ లో ఆర్మీ ఆపరేషన్ ఆపాలని బలూచి ఉద్యమకారులు ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు సోమవారం నాడు ఆందోళనకు దిగారు. పాక్ ఆర్మీ వేల సంఖ్యలో బలూచిస్థాన్ మద్దతుదారులను మాయం చేసిందని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి 40 మానవ హక్కుల కౌన్సిల్ సమావేశాలు జరుగుతుండడంతో బలోచి హూమన్ రైట్స్ కౌన్సిల్ నిరసన వ్యక్తం చేసింది. బలూచిస్థాన్ లో పాక్ మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని విమర్శించారు.