రాజస్థాన్, మార్చ్ 09:ఈ రోజు ఉదయం రాజస్థాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కు చెందిన డ్రోన్ భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. శ్రీగంగానగర్ సమీపంలోని హిందూమల్కోట్ ప్రాంతంలోని సరిహద్దు గుండా వస్తున్న పాక్ డ్రోన్ ను పసిగట్టిన రక్షణ దళం(బీఎస్ఎఫ్) దాన్ని కూల్చివేయడానికి ప్రయత్నించడంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయింది. అని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు పాక్ డ్రోన్ భారత్లోకి ప్రవేశించడానికి చేసిన మరో ప్రయత్నం ఇది అయితే పెద్దఎత్తున ఫైరింగ్ శబ్దాలు వినిపించాయని సరిహద్దు సమీపంలో నివసించే గ్రామస్థులు వెల్లడించారు. తెలిపారు.