న్యూఢిల్లీ, మార్చ్ 08: ప్రపంచ ఆరోగ్యసంస్థ ముఖ్య శాస్రకతవేత్తగా సౌమ్యస్వామినాధన్ నియమితులయ్యారు. ఈమె ఇంతకు ముందు అదే సంస్థకు డిప్యూటి డైరెక్టర్ జనరల్గా పని చేశారు. ఇప్పటివరకూ డిడిపథక నిర్వహణ అధికారిగా ఉన్న సౌమ్య ప్రపంచ ఆరోగ్యసంస్థలో ఉన్న ముగ్గురు డిడిజిల్లో ఒకరుగా డైరెక్టర్ జనరల్ టెడ్రాస్ అధనామ్ గెబ్రియేసస్కు రిపోర్టు చేస్తారు. ప్రపంచ ఆరోగ్యసంస్థలో ఈ విభాగాన్ని కొత్తగా సృష్టించారని, ఇదొక కొత్త విభాగమని ఆమె పేర్కొన్నారు. కొత్త డివిజన్ సంస్థకు ఐదో స్తంభంగా నిలిచింది.