జమ్మూకాశ్మీర్, మార్చి 02: పాకిస్తాన్ ప్రభుత్వం తాము శాంతిని కోరుకుంటామని చెబుతూనే, సరిహద్దులలో కాల్పులకు తెగబడుతుంది. నియంత్రణ రేఖ వద్ద యథేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ బలగాలను కవ్విస్తోంది. తాజాగా పూంచ్, రాజౌరీ జిల్లాల్లో పాకిస్థాన్ కాల్పుల కారణంగా పది మంది భద్రతా సిబ్బంది మృతిచెందారు. భారత్ వింగ్ కమాండర్ అభినందన్ విడుదల కావడంతో భారత్, పాక్ ల మధ్య శాంతి చర్చలు కొనసాగుతాయని ప్రపంచం భావిస్తోంది. కానీ భారత్ సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా పాకిస్థాన్ తుపాకులు, హోవిట్జర్లు, మోర్టార్ షెల్స్తో సరిహద్దులో విరుచుకుపడుతోంది. పాకిస్థాన్ చర్యలను విజయవంతంగా భారత్ బలగాలు తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఒక సాధారణ పౌరుడు, మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.