జమ్ములో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

SMTV Desk 2017-08-05 10:58:51  encounter in jammu

జమ్ము కశ్మీర్, ఆగస్ట్ 5 : జమ్ములోని సోపోర్ పట్టణంలో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. నిన్న జరిగిన అనంతనాగ్ జిల్లాలో ఓ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదిని హతమార్చిన భద్రతాసిబ్బంది ఈ తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను మట్టుపెట్టారు. నిఘావర్గాల సమాచారం మేరకు సోపోర్‌లోని అమర్‌గఢ్ ప్రాంతంలో భద్రతాసిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులకు దిగిన భద్రత సిబ్బంది తూటాలకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరి వద్ద నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు స్వాధీనం చేసుకున్నారు. కాగా ముష్కరుల కాల్పుల్లో ఓ పోలీసు గాయపడగా తనను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.