పాకిస్తాన్, ఫిబ్రవరి 26: ఈరోజు తెల్లవారుజామున పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని భారత్ భావిస్తుంది. అయితే పాక్ సైన్యాధికారి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ మాత్రం ఈ దాడులలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రకటించాడు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ..."ముజఫరాబాద్ సెక్టార్ లో భారత విమానాలు సరిహద్దులను దాటి మూడు నుంచి నాలుగు మైళ్ల దూరం వచ్చాయి. అవి కొన్ని బాంబులను జారవిడిచాయి. అవి ఖాళీ ప్రాంతంలో పడ్డాయి. భవనాలు, ఇతర మౌలిక వసతులేవీ ధ్వంసం కాలేదు. ఒక్కరు కూడా మరణించలేదు. మరిన్ని వివరాలు కాసేపట్లో వెల్లడిస్తాం" అని తెలిపారు.