ఇస్లామాబాద్, ఫిబ్రవరి 26: భారత్ పట్ల పాకిస్తాన్ కు ఉన్న ఇర్శ్యను మరోసారి చూపించింది. ఎన్నో సార్లు ఈ విషయంపై వాదించిన పాకిస్తాన్, భారతదేశంలో కశ్మీర్ భాగం కాదని, ఇంకెప్పుడూ కాబోదని మరోసారి కుండ బద్దలుగోట్టినట్టు చెప్పింది. భారత్ నే టార్గెట్ చేసిన పాక్ ఈ విధంగా వ్యాఖ్యానించింది.
సోమవారం పాకిస్తాన్ ప్రసారశాఖ మంత్రి ఫవాద్ చౌదరి మాట్లాడుతూ, భారత్లో కశ్మీర్ భాగం కాదని, ఇంకెప్పటికీ కాబోదని తేల్చి చెప్పారు. అంతేకాదు, కశ్మీర్లో ప్రభుత్వం చేస్తున్న దారుణాలను ఆపాలని, ఇతర రాష్ట్రాలతో సమానంగా కశ్మీరీ ప్రజలకు సమాన హక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత్తో సంబంధాలనే పాక్ కోరుకుంటోందన్న ఆయన పరిస్థితులు చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.