హైదరాబాద్, ఆగష్టు 3 : ‘కిక్’, ‘టెంపర్’, ‘రేసుగుర్రం’ వంటి హిట్ సినిమాల రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ అనే చిత్రం తో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ సక్సెస్తో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికగా నటిస్తున్నారు. నాగబాబు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా- శ్రీధర్ నిర్మిస్తుండగా, బన్ని వాసు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం లో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ లతో పాటు తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు అని సమాచారం. బాలీవుడ్లో పేరు పొందిన సంగీత దర్శకుడు ద్వయం విశాల్-శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" రెగ్యులర్ షూటింగ్ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఇందులో అల్లు అర్జున్ మిలటరీ ఆఫీసర్గా కనిపించనున్నారట. అందుకు తగ్గట్లుగా కనిపించేందుకు అమెరికా నుంచి వచ్చిన ట్రైనర్ సమక్షంలో ఫిట్నెస్ శిక్షణ పొందుతున్నట్లు తెలిసింది. ఈ సందర్బంగా ఈ సినిమాను ఏప్రిల్ 27, 2018న విడుదల చేస్తామని తెలిపింది చిత్ర యూనిట్.