వాళ్ళలా సినిమాలు తీయాలని ఉంది : కృష్ణవంశీ

SMTV Desk 2017-08-01 13:11:58  KRISHNAVAVAMSHI, LATEST MOVIE NAKSHATRAM

హైదరాబాద్, ఆగష్టు 1 : మహాత్మా, చందమామ, గోవిందుడు అందరివాడేలే... వంటి మంచి కుటుంబ కథా చిత్రాలను అందించారు కృష్ణవంశీ. తాజాగా ఆయన తెరకెక్కించిన "నక్షత్రం" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. "నేను ఓ క్రియేటివ్ దర్శకుడు అనే మాటలను గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పారు. "బాహుబలి" వంటి సినిమాలు చూసినప్పుడు దర్శకత్వమంటే ఇలా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మణిరత్నం గారిలా ఓ సినిమా తీయాలని, బాపు గారిలా ఒక పాటను చిత్రీకరించాలని ఉంది. అలాంటి సినిమాలు తీసిన రోజున నేను దర్శకుడినేనని అనిపిస్తుంది. అలా అనుకున్న రోజు ఇక సినిమాలు ఆపేసి వ్యవసాయం చేసుకుంటా అన్నారు. అయినా తానూ ఇప్పటికీ డైరెక్టర్ దగ్గర పాఠాలు నేర్చుకునే స్థాయిలోనే ఉన్నా"అని తెలిపారు.