తిరువనంతపురం, జూలై 20: ప్రముఖ నటుడు కమలహాసన్ రాజకీయాలలోకి వస్తారో, లేదో తెలియదు కాని, ఆయన చేసిన వ్యాఖ్య తమిళనాడులోని అన్నా డి.ఎమ్.కె ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది. తమిళనాడు రాష్ట్రంలో తీవ్రం అవుతున్న డెంగూ జ్వరాలను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేకుంటే అధికారం నుంచి తప్పుకోవాలని కమల్ హసన్ డిమాండ్ చేశారు. గతంలో ఒకసారి తన కుమార్తె కు కూడా డెంగూ జ్వరంతో చనిపోయి ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. తమిళనాడులో డెంగ్యూ పై ఆయన ట్వీట్ చేయడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వాన్ని తప్పు కోవాలని అనడం మరో ఎత్తుగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కమల్ హసన్ కు , తమిళనాడు మంత్రులకు మద్య గత కొద్ది రోజులుగా మాటల యుద్దం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే కమల్ కామెంట్ ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి.