హైదరాబాద్: సాక్ష్యం సినిమాతో విజయం సాధించినా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. కాగా తన ప్రతి సినిమాలో ఓ బడా హీరోయిన్ తో ఐటెం సాంగ్ ఉండేలా చూసుకునే బెల్లం కొండ ఈ సారి కూడా అదే మంత్రం ఫాలో అవుతానంటున్నాడు. అందుకు తేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ అయితే బావుంటుందని అనుకున్నారట.. అందులో భాగంగా ఇటీవల RX 100 సినిమా తో హిట్ కొట్టిన పాయల్ రాజ్ పుత్ ని నిర్ణయించారట యూనిట్ సభ్యులు, తను అయితే సినిమాకి కూడా ప్రయోజనకరంగా ఉంటుందని భావించారట, పాయల్ కూడా ఈ ఆఫర్ ని అంగీకరించడం తో త్వరలోనే ఈ ఐటెం సాంగ్ చిత్రీకరణ మొదలవ్వబోతుంది అని సమాచారం.