హైదరాబాద్, జూలై 17 : ‘మజ్ను’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ చిత్రాలతో ఆకట్టుకున్న అనూ ఇమ్మాన్యుయేల్ ఇప్పుడు అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య" సినిమాలో కలిసి నటించే అవకాశాన్ని అందుకున్నట్లు సమాచారం. ఇది వరకే అల్లు అర్జున్, శరత్ కుమార్ కలిసి బన్ని సినిమాలో తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. కాగా ఈ సినిమాకి వక్కతం వంశీ దర్శకత్వం వహిస్తుండగా, లగడపాటి శ్రీధర్, శిరీష నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బన్ని సరసన నటించేందుకు చాలా మంది కథానాయికల పేర్లను పరిశీలించారు. కాని అనూ ఇమ్మాన్యుయేల్ అయితే బాగుంటుందనిపించిందట. తన పాత్ర కేవలం గ్లామర్ కే పరిమితం కాదు కథలోనూ భాగం ఉందని చిత్ర బృందం తెలిపింది. కాగా ఈ చిత్రానికి సంగీతం విశాల్ - శేఖర్ లు అందించనున్నారు.