మూడనమ్మకాలకు బలైన కుటుంబం

SMTV Desk 2017-07-10 17:27:38  Chanting, of, mantras, five, suicides

కరీంనగర్, జూలై 10 : మంత్రాలు చేస్తుందన్న నెపంతో గ్రామస్తులు దాడి చేయగా ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ మండలం కందుగులలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గంగిరెద్దుల కులానికి చెందిన కొమురయ్య(36), కొమురమ్మ(32) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. ఎల్లమ్మ(10), కోమల(6), అంజలి(3). కాగా ఆ దంపతులకు మంత్రాలు వస్తాయనే నెపంతో గ్రామస్తులు వారిపై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ దంపతులు తమ ముగ్గురు ఆడ పిల్లలకు ఉరి వేసి తాము ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులను ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.