హైదరాబాద్, మే 25 : మద్యం సేవించి కారు నడిపి మరో కారును ఢీకొట్టిన ఘటనలో సినీ దర్శకులు బాబీ జూబ్లీహిల్స్ పోలీసులకు నిన్న రాత్రి 11.30 గంటలకు లొంగిపోయాడు. ఆదివారం రోజున 11.30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 33లో కారులో వేగంగా వెళ్తున్న బాబీ.. ఎదురుగా ఉన్న హర్మేందర్ అనే యువ వ్యాపారి కారును ఢీకొట్టాడు. అదేంటని ఆ వ్యక్తి ప్రశ్నించగా మధ్య సేవించి ఉన్న బాబీ అమర్యాదగా మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడ౦టూ హర్మేందర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన జరిగిన నాటి నుండి బాబీ పరారీలో ఉండగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిన్న రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.