చెన్నై, మే 7 : సూపర్ స్టార్ రజనీకాంత్ తన మనవడు వేద్ కృష్ణ పుట్టినరోజు వేడుకలను తన నివాసంలో ఘనంగా నిర్వహించారు. రజనీ చిన్న కుమార్తె సౌందర్య కుమారుడు వేద్ కృష్ణ బర్త్డే పార్టీ ఫొటోలను సౌందర్య ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా.. "మూడేళ్ల క్రితం ఈ ఏంజిల్ నా జీవితంలోకి వచ్చాడు. మై మిరాకిల్, మై బేబీ. కుటుంబంతో వేడుకలు" అని ట్వీట్ చేశారు. సౌందర్య చెన్నైకి చెందిన వ్యాపారవేత్త అశ్విన్ రామ్కుమార్ను 2010లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల వారిద్దరూ గత సంవత్సరం విడాకులు తీసుకున్నారు. కుమారుడు వేద్ కృష్ణ మాత్రం తల్లి వద్దే ఉంటున్నాడు. రజనీ చేతిలో బొమ్మ పట్టుకుని తన మనవడిని చూసి మురిసిపోతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకల్లో సౌందర్య సోదరి ఐశ్వర్య, ధనుష్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.