వినూత్న ప్రయోగం చేయనున్న హీరో విశాల్..

SMTV Desk 2018-05-05 16:49:05  vishal hero, samantha, irambu tirai, hollywood processor.

హైదరాబాద్, మే 5 : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమ౦త జంటగా నటించిన చిత్రం "ఇరంబు తిరై". పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ వినూత్న ప్రయోగం చేయబోతున్నాడు హీరో విశాల్. ఈ చిత్రం ద్వారా విశాల్ సరికొత్త హాలీవుడ్ ప్రాసెస్‌ని ఇండియాలో ఫస్ట్ టైమ్ పరిచయం చేయబోతున్నాడు. అదేంటంటే ఫుటేజ్ స్క్రీనింగ్. ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి రెండు రోజుల ముందే తమిళ మీడియా వాళ్లకు ఫుటేజ్ స్క్రీనింగ్‌ని ఏర్పాటు చేశాడు విశాల్. సినిమాలోని పలు కీలక అంశాలకు సంబంధించిన మేకింగ్ తదితర విశేషాలతో ఈ స్క్రీనింగ్ ఉంటుంది. ఇండియాలో ఇలాంటి ప్రమోషన్ కొత్తే కాని హాలీవుడ్ లో ఇది ఎప్పటి నుండో నడుస్తున్న ట్రెండ్. తెలుగు మీడియాకు కూడా ఇలాంటి స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తారేమో చూడాలి.