హైదరాబాద్, మే 4 : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం "సాహో" షూటింగ్ నిమిత్తం దుబాయ్ లో ఉన్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వం వహించిన చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్ నటిస్తోంది. అమీ జాక్సన్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్లో ప్రభాస్తో కలిసి దిగిన ఫొటోలను నీల్ నితిన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అంతేకాదు.. "నా దృష్టిలో ప్రభాస్ నేషనల్ డార్లింగ్.. ఆయన ఎంతో ఆత్మీయంగా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరినీ వెంటనే తన ప్రేమలో పడేసేలా చేస్తాడు. నా కుటుంబంతో ఆయన గడిపిన క్షణాలు నాకెంతో ఆనందంగా గడిచాయి" అంటూ పోస్ట్ చేశాడు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.