హైదరాబాద్, మే 4 : అక్కినేని అఖిల్ ప్రస్తుతం వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇదివరకు దర్శకుడు వెంకీ "తొలిప్రేమ" చిత్రాన్ని రూపొందించి ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే అఖిల్ పక్కన కథానాయికగా ఎవరిని ఎంచుకోవాలా అనే చర్చ కొద్దిరోజులుగా జరుగుతోంది. ఇందుకోసం చాలా మంది పేర్లనే పరిశీలించారు. తాజాగా ఆ అదృష్టం నిధి అగర్వాల్ వరించినట్లు తెలుస్తోంది. తనకు ఆడిషన్ నిర్వహించి ఈ పాత్రకు కచ్చితంగా సరిపోతుందనుకున్న తర్వాత ఒకే చేశారట. ప్రస్తుతం ఈ భామ అక్కినేని నాగ చైతన్య సరసన "సవ్యసాచి" చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఇంకా చిత్రీకరణ జరుపుకుంటోంది.