చెన్నై, మే 3 : సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమాలో నటిస్తున్నారంటే ఆ సినిమాకు ఉండే క్రేజే వేరు. రిలీజ్ కు ముందే రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా తలైవా నటించిన "2.ఓ" సినిమా శాటిలైట్ రైట్స్ కొన్ని కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. అంతేకాకుండా "కాలా" సినిమా పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే కాలా తర్వాత రజనీ.. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. రజనీ కి ఈ చిత్రం 165 వది కావడం విశేషం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. విషయమేమిటంటే.. రజనీకాంత్ ఈ చిత్రానికి తీసుకోబోయే పారితోషికం గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతకీ తలైవా ఈ చిత్రం కోసం రూ.65 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు కోలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ విషయంపై రజనీకాంత్ ఏమంటారో..! ప్రస్తుతం అమెరికాలో మెడికల్ చెకప్ నిమిత్తం వెళ్ళిన రజనీ.. త్వరలో చెన్నైలో జరగబోయే "కాలా" ఆడియో లాంచ్ కార్యక్రమానికి హాజరుకానున్నారు.