నాకు ఆ నిజమైన మనిషి కావాలి..

SMTV Desk 2018-05-02 11:57:41  SAMMOHANAM, SUDHEER BABU, ATHITHI RAO HAIDARI, SAMMOHANAM TEASER.

హైదరాబాద్, మే 2 : సుధీర్ బాబు కథానాయకుడిగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "సమ్మోహన౦". ఈ చిత్రంలో సుధీర్ బాబు సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అదితి రావు హైదరి కథానాయికగా నటించారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ ను సుధీర్ తన ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ.. "నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా. మీకందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా" అంటూ ట్వీట్ చేశారు. ఈ టీజర్ లో సుధీర్ బాబు.. హీరోయిన్ ను ఉద్దేశించి.. ఈ అందం అంతా మెల్లమెల్లగా పోతుంది. చర్మం ముడతలు పడి, పళ్లు ఊడిపోయి, కాళ్లు వంగిపోయి, జుట్టు రాలిపోయి.. ఈ ముఖం వెనకాల వేరే ఒకరు ఉన్నారు. ఒక వ్యక్తిత్వం.. అది నిజమైన నవ్వు, నాకు ఆ నిజమైన మనిషి కావాలి" అంటూ చెబుతున్న డైలాగ్ ఎంతో ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ బాణీలు అందిస్తున్నారు