హైదరాబాద్, ఏప్రిల్ 30 : అలనాటి మేటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా "మహానటి" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సమ౦త, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు, శాలినీ పాండే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని కీర్తి సురేష్ బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు అచ్చం అలాగే ఉన్న సావిత్రి ఫోటోను జత చేస్తూ ఒక పిక్ను రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో అచ్చం సావిత్రిలా కీర్తి ఒదిగిపోయింది. కాగా వచ్చే నెల 9 వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
All eyes on @KeerthyOfficial's #Mahanati. Another lovely still from the film. Lot of work has gone into the building Keerthy's look in the film. @VyjayanthiFilms#MahanatiAudioOnMay1st#MahanatiOnMay9th pic.twitter.com/GQSW7RELao
— Nagesh4Movies®️ (@Nagesh_Movies) 30 April 2018