తొలిసారి కేన్స్ లో కంగనా.!!

SMTV Desk 2018-04-24 14:29:24  kangana ranaut, cannes film festival, kangana attend the cannes.

ముంబై, ఏప్రిల్ 24 : ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ కార్యక్రమానికి తొలిసారిగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. కేన్స్ ప్రచారకర్తగా ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం. కేన్స్ లో భారతీయ చిత్రాలతో పాటు విదేశీ చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తుంటారు. కేన్స్‌ జ్యూరీ సభ్యురాలిగా ఐశ్వర్య రాయ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి ఐశ్వర్య రాయ్‌, కత్రినా కైఫ్‌, సోనమ్‌ కపూర్‌, మల్లికా శెరావత్‌, తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమానికి ఎందరో తారలు హాజరవుతారు. తాజాగా ఈ ఏడాది జరగనున్న ఈ కార్యక్రమానికి కంగనా హాజరుకానున్నారు. ప్రస్తుతం కంగనా.. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో "మణికర్ణిక" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టులో విడుదల కానుంది.