పోస్టర్స్ తో మతి పోగొడుతున్నారు..!!

SMTV Desk 2018-04-22 16:20:43  MAHANATI MOVIE, KEERTHI SURESH, SAMANTHA, VIJAY DEVARAKONDA,

హైదరాబాద్, ఏప్రిల్ 22 : అలనాటి నటి సావిత్రి జీవితచరిత్రను వెండి తెరమీద "మహానటి" గా ఆవిష్కరించనున్న విషయం తెలిసిందే. సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. ఆమె భర్త పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. ఇప్పటివరకు "మహానటి" ఫస్ట్ లుక్ అని, మూగ మనసులు పాట అంటూ పోస్టర్ లను విడుదల చేస్తూ అభిమానులలో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చారు. దీంతో సావిత్రి జీవితంలో జరిగిన విషయాలు, తీసుకున్న మలుపులు ఏంటి అనే విషయాలపై అభిమానులలో తీవ్రమైన ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్రబృందం పోస్టర్స్ రూపంలో రెండు చిత్రాలను విడుదల చేసింది. ఇందులో సావిత్రి రూపంలో కీర్తి సురేష్ ఇట్టే ఒదిగిపోయింది అని చెప్పవచ్చు. అయితే ఇటీవలే విడుదలైన మూగ మనసులు ఆడియో ట్రాక్ టాప్ లిస్టులో చేరిపోయింది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 9వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో వైజయంతి మూవీస్ ప్రమోషన్స్ వేటలో పడిపోయింది. నాగ అశ్విన్ దర్శకత్వం వస్తున్న ఈ చిత్రంలో సమ౦త, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, శాలినీ పండే ప్రధాన పాత్రలుగా నటిస్తున్నారు.