మక్కా మసీదు పేలుళ్లపై పునర్విచారణ: అసదుద్దీన్‌ ఒవైసీ

SMTV Desk 2018-04-20 16:40:23   Asaduddin Owaisi Seeks Re-Trial In Mecca Masjid Blast Case

హైదరాబాద్, ఏప్రిల్ 20‌: మక్కా మసీదు పేలుళ్ల కేసు పై పునర్విచారణ జరిపించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు విచారణ జరిపినట్టు.. మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో సరైన స్థాయిలో విచారణ జరిపించలేదని ఆయన అన్నారు. మక్కా మసీదు కేసు తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ చేయాలని అసదుద్దీన్‌తో పాటు మతపెద్దలు, నాయకులు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.