అమరావతి, ఏప్రిల్ 12: డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీసెట్) గడువు ఈ నెల 24 వరకు పెంచుతున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. డీసెట్ దరఖాస్తుల గడువు గురువారంతో ముగిసిందని, కానీ విద్యార్థుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు గడువు పొడిగిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే డీసెట్ పరీక్ష గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.