న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: విద్య , ఉద్యోగ నియామకాల్లో కుల ఆధారిత రిజర్వేషన్లను వ్యతిరేఖిస్తూ కొన్ని సంస్థలు మంగళవారం ‘భారత్ బంద్’ను నిర్వహించనున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్ని రాష్ట్రాలను హోంశాఖ ఆదేశించింది. ఇటీవల ఎస్సీ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ దళిత సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ హింసాత్మకంగా మారిన విషయం తెల్సిందే. బ౦ద్ లో శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే ఆ ప్రాంతానికి చెందిన కలెక్టర్, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హోంశాఖ హెచ్చరించింది.