న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో పోరుబాట పట్టిన తెలుగుదేశం పార్టీ ఎంపీలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ప్రధాని నివాసం ముట్టడికి యత్నించిన ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకుని తుగ్లక్ పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో అక్కడికి చేరుకున్న కేజ్రీవాల్ ఎంపీలతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. కేంద్రంపై పోరాడుతున్న తెదేపా ఎంపీలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ప్రధానిని కలిసేందుకు వెళ్తున్న ఎంపీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం బాధాకరమన్నారు.