నేడు జైట్లీకి కిడ్నీ మార్పిడి

SMTV Desk 2018-04-07 15:07:55  Kidney transplant, Surgery Treatment, Arun Jaitley, Aims

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ శుక్రవారం ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)లో చేరారు. నేడు ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేస్తారని, అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జైట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అపోలో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ సందీప్‌ గులేరియా జైట్లీకి శస్త్రచికిత్స చేస్తారని సమాచారం. అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజులుగా జైట్లీ ఇంటికే పరిమితమయ్యారు. ఈనెల 12న జరిగే 10వ ‘బ్రిటన్‌–ఇండియా ఆర్థిక, వాణిజ్య చర్చ’ల్లో పాల్గొనేందుకు లండన్‌ వెళ్లాల్సి ఉండగా.. అనారోగ్య కారణాలతో పర్యటనను రద్దుచేసుకున్నారు.