ప్రభుత్వ వెబ్‌సైట్లపై సైబర్‌ దాడి!

SMTV Desk 2018-04-07 11:11:47  home ministry,Government Website, hacking attacks, china hackers

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ప్రభుత్వ వెబ్‌సైట్లు శుక్రవారం హ్యాకింగ్‌కు గురయ్యాయి.12కు పైగా రక్షణ, హోం మంత్రిత్వశాఖల వెబ్‌సైట్లపై హ్యాకర్లు సైబర్‌దాడికి పాల్పడ్డారు. ఈ వెబ్‌సైట్లలో చైనీస్‌ అక్షరాలు కన్పించడంతో ఈ పని చైనా హ్యాకర్లే చేసుంటారని అధికారులు అనుమానిస్తున్నారు. రక్షణ, హోం మంత్రిత్వశాఖలతో పాటు న్యాయ, కార్మిక మంత్రిత్వశాఖల వెబ్‌సైట్లపై కూడా సైబర్‌దాడి జరిగింది. ఈ ఘటనపై స్పందించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ త్వరలో రక్షణ శాఖ వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తామని ట్వీట్‌ చేశారు. నెట్‌వర్కింగ్‌ వ్యవస్థలో హార్డ్‌వేర్‌ ఫెయిల్యూర్‌ కారణంగానే ఈ ఇబ్బంది తలెత్తిందని, జాతీయ సైబర్‌ భద్రత (ఎన్‌సీఎస్‌) సమన్వయకర్త గుల్షన్‌ రాయ్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్లపై ఎలాంటి సైబర్‌దాడి జరగలేదని ఆయన వెల్లడించారు.