ముంబై, ఏప్రిల్ 6 : ఐపీఎల్-11 సీజన్ రేపు ముంబైలో వాంఖేడ్ స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానుంది. లీగ్ లో భాగంగా ఏప్రిల్ 7న తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్తో, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. రేపు మ్యాచ్ ముందు జరిగే ఆరంభవేడుకల్లో చెన్నై సారథి ధోని, ముంబై ఇండియాన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొంటున్నారు. అయితే ఈ ఏడాది కొన్ని అనివార్యకారణాల వలన హాజరు కావట్లేదు. దీంతో అభిమానులు ఎంతో నిరుత్సాహనికి లోనయ్యారు. తాజాగా టోర్నీ నిర్వాహకులు ఐపీఎల్ ట్రోఫీతో ఎనిమిది జట్ల సారథులతో ఫొటో షూట్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఐపీఎల్ ట్విటర్ పేజీ ద్వారా పంచుకున్నారు. "ఈ సీజన్లో ఇలా అన్ని జట్ల కెప్టెన్లనూ ఒకే వేదికపై చూస్తామనుకోలేదు. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తిరిగి ఐపీఎల్లో ఆడటం ఎంతో ఆనందంగా ఉంది" అని నెటిజన్లు సంతోషంతో తెగ కామెంట్లు పెడుతున్నారు.