ముంబై, ఏప్రిల్ 5 :ఫేస్ బుక్ దిగ్గజం మార్క్ జుకేర్ బర్గ్.. మరోసారి తనను క్షమించాలని కోరుతున్నారు. ఇప్పటికే ఫేస్ బుక్ యూజర్ల వ్యక్తిగత సమాచారం పరుల పాలైందని వచ్చిన వార్తల నేపథ్యంలో జుకేర్ నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. తాజాగా మరోసారి మీడియాతో మాట్లాడిన జుకేర్ బర్గ్.. చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను మన్నించి, సంస్థను ఉన్నత స్థానంలో తీసుకురావడానికి నాకొక అవకాశాన్ని ఇవ్వండని వేడుకున్నారు. థర్డ్ పార్టీకి సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడంలో నియమ నిబంధనల లోపాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. తప్పులు చేయడం మనవ సహజమని.. ఈ ఒక్కసారి సరిదిద్దుకునే అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. అయితే ఫేస్ బుక్ లో 8.7 కోట్ల మంది వివరాలు చోరీ కాగా ఇందులో అత్యధిక ఖాతాలు అమెరికన్లవే.